పిళ్లా యశ్వంత్ రెడ్డి (ఏడోతరం 10)
పిళ్లా యశ్వంత్ రెడ్డి 19-04-1995న పిళ్లా విజయకుమార స్వామిరెడ్డి, గంగవరం లక్ష్మిదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా కడపలో జన్మించారు. యశ్వంత్ కు అతని మేనమామ రామకృష్ణారెడ్డి చోటూ అని ముద్దుపేరు పెట్టారు. వారి తండ్రి అనంతపురం జిల్లాలోని కదిరి జీవిత బీమా సంస్థలో డెవలప్ మెంట్ ఆఫీసరుగా 1991 నుండి పనిచేస్తున్నారు.దాంతో యశ్వంత్ కుటుంబం కదిరి వాణీ వీధిలో వుండేది.ఆ వీధి చివరలో వున్న ఖాద్రీ పాఠశాలలో యల్.కె.జి. (లోయర్ కిన్నర్ గార్డెన్)తో యశ్వంత్ తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. తరువాత తన అక్క జ్యోత్స్న చదువుతున్న హరీష్ స్కూలులో యు.కె.జి. (అప్పర్ కిన్నెర్ గార్డెన్), ఒకటవ తరగతి పూర్తిచేశారు. తన తండ్రి అనంతపురంలో సొంత ఇల్లు నిర్మించాక కుటుంబం అక్కడికి మారింది. అనంతపురంలో అప్పట్లో మంచి పేరున్న చిన్మయా నగర్ లో వున్న యల్.ఆర్.జి. పాఠశాలలో 2 నుండి 7వ తరగతి వరకు చదివారు. "మన జీవితం మన చేతుల్లో వుంది. మనం ఎదగాలి అంటే మనం అబ్రహామ్ లింకన్ లాగా చదవాలి. గాం...